PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పైపాలెంలో గృహాలను పరిశీలించిన డిఈఈ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో గృహాలను గృహ నిర్మాణ శాఖ డిఈఈ ప్రభాకర్ పరిశీలించారు.తర్వాత గృహ లబ్ధిదారులతో ఇండ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో ఎవరెవరికైతే ఇల్లు మంజూరు అయ్యాయో కొన్ని ఏళ్ళు వివిధ దశలలో ఉన్నాయని అంతేకాకుండా ఏకంగా కొందరు ఇంకా పునాదులు కూడా తీయలేదని ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక సిమెంటు కడ్డీ అందుబాటులో ఉన్నాయని మీకు ఎప్పుడు కావాలన్నా వాటిని అందిస్తామని అంతేకాకుండా బిల్లులు కూడా వెంట వెంటనే పడుతున్నాయని లబ్ధిదారులకు డిఈఈ అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు,హౌసింగ్ ఇన్చార్జి రమేష్,హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author