PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జైల్లో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాల‌న్న వివేక హ‌త్య కేసు నిందితుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలంటూ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బుధవారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం శివశంకర్‌రెడ్డి.. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శివశంకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కడప జిల్లా కోర్టులో సీబీఐ న్యాయవాది వాదనలు వినిపించారు. శివశంకర్‌రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 7కు వాయిదా వేసింది.

                                 

About Author