PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రమణీయం..రథోత్సవం

1 min read
రథోత్సవంలో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లు

రథోత్సవంలో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లు

పల్లెవెలుగు, శ్రీశైలం ;
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణం నుంచి ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో రథశాలవద్దకు తీసుకొచ్చారు. ఆ తరువాత రథాంగపూజ, హోమం, రథాంగబలిని స్థానాచార్యులు పూర్ణానంద ఆచార్యులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చారు. శ్రీశైలం ఆలయ కార్య నిర్వహణాధికారి కేఎస్​ రామారావు గుమ్మడి, కొబ్బరికాలు సమర్పించి.. అశేష భక్తజన వాహిని మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. రథశాల నుంచి బయలుదేరిన రథం నందిమండపం వరకు వెళ్లి.. అక్కడి నుంచి యథాస్థానానికి చేరుకుంది. రథోత్సవంలో జానపద కళాకారుల నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.

About Author