PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుంది

1 min read

– వైసీపీ గుండాలు రౌడీలు పెట్రేగిపోతున్నారు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని 9,10వ వార్డులలో వార్డు ఇన్చార్జి లు వెంకటేష్, మసాలా కాజా ల ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందని వైసిపి గుండాలు రౌడీలు పెట్రేగిపోతున్నారని ఒక గుండా రౌడీలు ముఖ్యమంత్రులు అయితే పరిపాలన ఇదేవిధంగా ఉంటుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అను కార్యక్రమాని నిర్వహిస్తామన్నారు. నారా లోకేష్ బాబు యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ ఉంటే వారికి వచ్చేటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయించి వైసీపీ రౌడీలతో, గుండాలతో దాడులు చేయించడం సిగ్గుమాలిన చర్యన్నారు. తేలుగుదేశం పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, తగలబెట్టడం లాంటి దౌర్జన్యాలకు దిగుతూ ప్రజల యొక్క ఆస్తులను సంపదను దోచుకుంటూ కబ్జాలు చేస్తూ ఎదురు తిరిగిన వారిని హత్యలు గావిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, హక్కులు ఏవీ లేకుండా హరించి వేస్తూ ఒక రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు వైసీపీ రౌడీ పాలనకు అంతం పలికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని “సేవ్ ఆంధ్ర ప్రదేశ్ – సేవ్ డెమోక్రసీ”అన్న నినాదంతో ముందుకు అడుగులు వేస్తూ వైసిపి పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని గెలిపించాలని పట్టబద్రులను, మేధావులను, నిరుద్యోగ యువతను కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడీపీ అధ్యక్షులు మూర్తుజావలి లీగల్ సెల్ నాయకులు జాకీర్ హుస్సేన్,తెలుగు యువత మద్దిలేటి, వార్డ్ ఇన్చార్జిలు కృష్ణారెడ్డి, గోవర్ధనగిరి, మాజీ ఎంపీటీసీ లక్ష్మన్న, ఎస్సీ సెల్ అధ్యక్షులు జయకర్, ఖలీల్ బేగ్, అనిల్, అక్షర భాష చింతా గోపాల్,సి పౌలు, అలీ, భాష, పింజరి షేక్షావలి, తదితరులు పాల్గొన్నారు.

About Author