PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్ల‌ర్ల సూత్ర‌ధారి ఇల్లు కూల్చివేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్‌లో అల్లర్ల సూత్రధారులకు యోగి సర్కారు బుల్డోజ‌ర్ పాల‌న చూపిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌ తదితర ప్రాంతాల్లో శుక్రవారం విధ్వంస ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను అధికారులు వరుసగా రెండో రోజూ ధ్వంసం చేశారు. శనివారం బుల్డోజర్లతో వెళ్లి నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు.. ఆదివారం కూడా ఆ పనిని కొనసాగించారు. ప్రయాగ్‌రాజ్‌ అల్లర్ల సూత్రధారి అయిన జావేద్‌ అహ్మద్‌ అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. మే 10న నోటీసులు ఇచ్చామని, మే 24న సమాధానమిస్తానన్న జావేద్‌ స్పందించకపోవడంతో మే 25న కూల్చివేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జావేద్‌ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు.

                                                

About Author