PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌డ‌ప‌లో వైఎస్ విగ్ర‌హం కూల్చివేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హం కూల్చేశారు. దువ్వూరు మండలం బలక్కివారిపల్లెలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే ఆ కూల్చివేసింది వైసీపీ శ్రేణులే కావడం గమనార్హం. వైఎస్సార్ విగ్రహాన్ని వైసీపీ శ్రేణులు జేసీబీతో కూల్చాయి. రామాలయం నిర్మాణం కోసం కూల్చామని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. విగ్రహం తొలగిస్తుండగా ఓ ఇల్లు ధ్వంసమైంది. అడ్డుకున్న బాధిత మహిళపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

                            

About Author