PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది..

1 min read

– టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఏలూరు స్థానిక చేపల తూము జంక్షన్ లో రిలే నిరాహార దీక్షలో నేటి వరకు కూడా కొనసాగాయి, శిబిరాన్ని ప్రారంభించిన టిడిపి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి మాట్లాడుతూ రాక్షస పాలన సాగిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దించడమే లక్ష్యంగా ఓటు అనే ఆయుధంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నరు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందని కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అన్నారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి నాటికి 28 రోజులు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైకో పాలన అంతమొందించే వరకు నిద్ర పోబోమని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్ మరియు ఆర్ ఎస్ ఆర్ నాగేశ్వరరావు, తవ్వ అరుణకుమారి, ఆర్యవైశ్య ప్రముఖులు, వాణిజ్య విభాగాల ప్రతినిధులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

About Author