PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ జకీయ ఖానం..

1 min read

పల్లెవెలుగు వెబ్​,కడప బ్యూరో: కడప పట్టణ 28 వ డివిజన్ కార్పొరేటర్ ఆరిఫ్ ఉల్లా భాష   రూపొందించిన నూతన సంవత్సర డైరీని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ జకీయ ఖానం రాయచోటి పట్టణంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.  తాను తయారు చేసిన డైరీని డిప్యూటీ స్పీకర్ ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆరిఫ్ ఉల్లా భాష ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ జకీయ ఖానం మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ముస్లిములు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉండకుండా రాజకీయాలలోకి రావాలని కృషి చేస్తున్న వ్యక్తి కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అవి తనకు తెలియజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

About Author