PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కమనీయంగా ..శ్రీవారి కల్యాణోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి( కోట్ల స్వామి) దేవస్థానం అలాగే సరస్వతి నగర్ లో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో రథసప్తమి వేడుకలు ఆలయ నిర్వహకులు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కల్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది, ఈ కళ్యాణోత్సవాన్ని మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించారు, అంతకుముందు ఉదయం సుప్రభాత సేవతో మొదలైన ప్రత్యేక పూజలు ఉదయం అభిషేకాలు, అర్చనలతోపాటు, ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణలు గావించారు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది, అనంతరం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది, అనంతరం 12 గంటలకు భక్తులకు ప్రజలకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు, తదుపరి సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవంలో, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, చెక్కభజనలు నిర్వహించడం జరిగింది.

About Author