PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

48వ డివిజన్ లో టిడిపి సంక్షేమ మేనిఫెస్టో వివరాలు..

1 min read

– చంద్రబాబు నాయుడుతోనే ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీ..

– నియోజకవర్గ ఇన్చార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  స్థానిక 48 వ డివిజన్ శివగోపాలపురం నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించి  నారా చంద్రబాబు నాయుడు  మ్యానిఫెస్టో ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి భవిష్యత్తు గ్యారెంటీ సర్టిఫికెట్లను అందించిన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) . ఈ కార్యక్రమంలో బడేటి చంటి  మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రా అభివృద్ధిని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి పోయిందని ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి కావాలని సంక్షేమం మరియు అభివృద్ధి చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ , మాజీ కార్పొరేటర్ సరిది కృష్ణవేణి , డివిజన్ ఇంచార్జ్ ఆరేపల్లి తిరుపతి  మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author