PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరకొండ జోరు..

1 min read

సినిమా డెస్క్​: యూత్‌ అంతా ఆత్రంగా ఎదురుచూసే క్రేజీ స్టార్‌‌ హీరో విజయ్ దేవరకొండ సంబంధించిన రెండు క్రేజీ అప్‌డేట్స్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. హరీశ్ శంకర్‌‌తో సినిమా చేస్తున్నాడు అని ఒకటైతే .. అనుష్క సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు అన్నది రెండోది. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ పూర్తయ్యింది. మరికొద్ది రోజుల్లో షూటింగు మొత్తం పూర్తి కానుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును త్వరలో మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమా తరువాత విజయ్ డైరెక్టర్‌‌ సుకుమార్ తో కలిసి పనిచేయాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉందిట. నిజానికి ‘పుష్ప’ సినిమా ఫినిష్‌ అవగానే విజయ్ ప్రాజెక్టును మొదలెట్టాలనుకున్నాడు సుకుమార్. అయితే ‘పుష్ప’ను రెండు భాగాలుగా చేయడంతో, సుకుమార్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అప్పటివరకూ విజయ్ దేవరకొండ వెయిట్ చేయలేడు. కనుక ఆయన హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయ్‌ అంటున్నారు. మరో విశేషం ఈ మూవీకి నిర్మాతగా దిల్ రాజు పేరు కూడా వినిపిస్తోంది. మరో వైపున పవన్ ప్రాజెక్టును పట్టాలెక్కించే సమయం కోసం హరీష్ శంకర్ వెయిట్ చేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇక అనుష్క మూవీ విషయానికొస్తే ఆమె ఒక విభిన్నమైన కథలో రొటీన్ కి భిన్నంగా ఉండే మూవీ ఒకటి చేస్తోంది. ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీలో తనొక గెస్ట్‌ రోల్‌ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. విజయ్, నవీన్‌లు ఫీల్డ్‌లోకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. సినిమాల్లోకి వచ్చేందుకు ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేశారు .. ఇద్దరు కలిసి నటించారు. ఆ మధ్య నవీన్ పోలిశెట్టి సినిమా వేడుకలో విజయ్ ఒక రేంజ్ లో సందడి చేశాడు కూడా. అందుకే న్యూస్‌ కొట్టేయడానికి లేదు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకి, ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్ మహేశ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు.

About Author