PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి అంటే టిడిపి తోనే సాధ్యం

1 min read

– మిడుతూరులో కాత రమేష్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రచారం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి టిడిపి బలపరిచిన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని వారిని కోరారు.ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గత టిడిపి ప్రభుత్వానికి ఈప్రభుత్వానికి గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఎంత వరకు జరిగిందనేది మీరు గమనించాలని ఆయన పట్టభద్రులకు తెలియజేస్తూ 13వ తేదీన జరిగే ఎన్నికలలో టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో హరి సర్వోత్తమ్ రెడ్డి, మహేశ్వరరెడ్డి,బన్నూరు శ్రీనివాసులు రెడ్డి,సుభాన్,రవి, చాంద్ బాష తదితరులు పాల్గొన్నారు.

About Author