NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భవిష్యత్తుకు గ్యారెంటీ..అభివృద్ధి టిడీపీ తోనే సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గత ఐదేళ్ల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనిపించడం లేదని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామ టిడిపి నాయకులు ఎస్ రమణారెడ్డి,సోఫీసాహేబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు,18 సం.లు దాటిన ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు తదితర వాటి గురించి జయ సూర్య ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,దేవనూరు మాజీ సర్పంచ్ నాగేంద్ర,ఎన్ వెంకటేశ్వర్లు,ఎల్లయ్య,రామకృష్ణుడు,శ్రీనివాసులు,రమేష్,సురేష్,జయన్న,రసూల్,మాబాష,శివరాముడు,రంగస్వామి,రాఘవేంద్ర,హరీష్,ప్రసాద్,మురళి,శివన్న,అజీస్ చౌట్కూరు గోకారి,ఎమ్మార్పీఎస్ నాయకులు స్వామన్న,గట్టు రవి,సుభాన్,లక్ష్మీనారాయణ,పరుశురాం,రఫీ,భాస్కర్,సున్నంపల్లి శ్రీనివాసులు,సాంబశివుడు యాదవ్,పగడం శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

About Author