PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ అధినేతతోనే..అభివృద్ధి సాధ్యం:  టిజి భరత్

1 min read

పల్లెవెలుగు: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఉండదని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ అన్నారు. నగరంలోని 11వ వార్డులోని ఖడక్ పుర, కనికంటి వీధిలో ఆయన భవిష్యత్తుకు భరోసా పేరుతో తిరిగి ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. టిడిపి గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం ఉంటుందో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రంలో చంద్రబాబు రావాలని, కర్నూల్ లో తాను ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి కర్నూలును ఎంతో అభివృద్ధి చేశారని.. తాను అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు అభివృద్ధి కావాలంటే తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఒక అవకాశం ఇస్తే తన పనితీరు ఏంటో చూపిస్తానన్నారు. అన్ని వార్డుల్లో లాగే ఈ వార్డులో కూడా డ్రైనేజీ సమస్య, త్రాగునీటి సమస్య, విద్యుత్ వైర్ల సమస్యతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఇక గుండె జబ్బుల బారిన పడి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ఉండేందుకు తమ టీజీవి సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని టిజి భరత్ అన్నారు. వీటికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెహబూబ్ ఖాన్, బషీర్, నౌషాద్, ఈశ్వర్, సలీం, ఫర్జానా, సభ, అదీబ్, రసూల్, సద్దాం, ఆనంతయ్య, ఆరిఫ్,  తదితరులు పాల్గొన్నారు.

About Author