NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టి.జి భరత్ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి… టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే కర్నూలు నగరం అభివృద్ధి చెందుతుందని టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ఇతర నేతలు అన్నారు. ఆదివారం నగరంలోని 48వ వార్డులో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన అనంతరం టిడిపి నేతలు మాట్లాడుతూ ఈ వార్డులోని ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. పన్నుల భారాన్ని ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉందన్నారు. మోసపూరిత మాటలతో వచ్చే నాయకులను నమ్మొద్దని ప్రజలను కోరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మన్సూర్ ఆలీఖాన్, వాహిద్ హుస్సేన్, సౌభాగ్య, సాబర్ మతి, శారద, సద్దాం, రఫిక్, వలి, ఖాజా, అంజాద్, మోసిన, వరుణ్, సురేష్, యోసాఫ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author