NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టి.జి భరత్ నాయకత్వంలోనే కర్నూలు అభివృద్ధి…

1 min read

టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ నాయకత్వంలోనే కర్నూలు నగరం అభివృద్ధి చెందుతుందని టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. సోమవారం నగరంలోని 42 వ వార్డు పరిధిలోని రాజీవ్ నగర్, బాబా బ్రుందావన్ నగర్, వాణిజ్య నగర్లో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వార్డులోని ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. పన్నుల భారాన్ని ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉందన్నారు. మోసపూరిత మాటలతో వచ్చే నాయకులను నమ్మొద్దని ప్రజలను కోరినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలందరూ తమ ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు వలి, హరిప్రసాద్, తిమ్మారెడ్డి, సత్యారెడ్డి, సురేఖ, రంజిత్, అఖిల, షాషావలి, బాగ్యలక్ష్మి, రామక్రిష్ణ, లక్ష్మిరెడ్డి, ఉమ, మాధవి, అయ్యన్న, నాగశేషులు, తదితరులు పాల్గొన్నారు.

About Author