PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీతోనే.. రాష్ట్రం అభివృద్ధి..: టి.జి భ‌ర‌త్

1 min read

బుధ‌వార‌పేట‌లో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్యక్రమం

కర్నూలు, పల్లెవెలుగు:చంద్రబాబు నాయుడు విజ‌యంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 16వ వార్డు బుధ‌వారపేట‌లో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్యక్రమాన్ని ఆయ‌న చేప‌ట్టారు. ప్రజ‌ల వ‌ద్దకు వెళ్లి రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల‌ని కోరారు. ఈ ఐదేళ్ల పాల‌న చూసిన ప్రజ‌లంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీకి, ఈ నాయ‌కుల‌కు బుద్ధి చెప్పాల‌న్నారు. త‌మ ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే న‌గ‌రంలో ఉన్న స‌మ‌స్యల‌న్నీ ప‌రిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం, అభివృద్ధి అందాల‌న్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూప‌ర్ 6 ప‌థ‌కాలు తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు క‌ర్నూలులో ఉన్న స‌మ‌స్యల‌ను ద‌గ్గర నుండి చూసి తాను కూడా 6 గ్యారెంటీలు రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. వీట‌న్నింటినీ అమ‌లుచేసి ప్రజ‌ల‌కు మెరుగైన పాల‌న అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ ప్ర‌భుత్వంలో యువ‌త ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌న్నారు. ఉద్యోగాల నోటిఫికేష‌న్లు రాక‌పోవ‌డంతో యువ‌తీ, యువ‌కులు నిరాశ‌లో ప‌డిపోవాల్సిన ప‌రిస్థితి దాపురించింద‌న్నారు. చంద్రబాబు విజ‌న్ వ‌ల్ల రాష్ట్రానికి ప‌రిశ్రమ‌లు త‌ర‌లిరావ‌డం ఖాయ‌మ‌న్నారు. యువ‌త‌కు 20 ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పించ‌డం వ‌ల్ల రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరిక‌డ‌తామ‌ని చెప్పారు. క‌ర్నూల్లో తాను గెలిచి ప్రతి ఒక్క‌రికీ మంచి చేస్తాన‌న్నారు. ప్రజ‌లంద‌రూ త‌ప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయకుమారి, మాజీ కార్పొరేటర్లు రామాంజనేయులు, అబ్బాస్, పామన్న, టిడిపి సీనియర్ నేతలు బాబ్జి, జేమ్స్, ఆర్జా రామకృష్ణ, గున్నామార్క్, నాయకులు క్రాంతి, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, మధు, కార్యకర్తలు, బూత్ ఇంఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author