PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా చంద్రబాబు నాయుడు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం…

1 min read

సత్రం రామకృష్ణుడు         

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు:  కోడుమూరు నియోజక వర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ ఆకె పోగు ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు…. కర్నూలు మండలం, ఈ తాండ్రపాడు గ్రామం నందు, 41వ బూతు నందు ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కి సంబంధించిన ఎన్రోల్మెంట్ చేస్తూ, చంద్రబాబు నాయుడుప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన షూరిటీ బాండ్లను ప్రజలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు. క్లస్టర్….4, ఇంచార్జ్ సత్రం రామకృష్ణుడు మాట్లాడుతూ….. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ పార్టీ కొరకు కష్టించి పనిచేయాలని, ఈ రాష్ట్రం బాగుపడాలన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు అందరూ గ్రహించి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మీ యొక్క ఆశీర్వాదాలు అవసరమని, మనమందరము కలిసి పని చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నిరుద్యోగ యువతీ, యువకులు బాగుపడాలన్న, రైతులు క్షేమంగా ఉండాలన్న, అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మహిళలు ఆర్థికంగా ఎదిగి ముందుండాలంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు,  కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కోశాధికారి     పి సత్యనారాయణ యాదవ్, 20వ యూనిట్ ఇన్చార్జి, కర్నూలు పార్లమెంటు టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎం సయ్యద్, 41వ బూతు ఇంచార్జ్ బి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బి రామాంజనేయులు , పట్టా వెంకటరాముడు, టి లక్ష్మీనారాయణ, పి సయ్యద్ బాషా, దుబ్బ నాగన్న, తెలుగు యువత నాయకులు టి పవన్, టి మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author