PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భరత్ గెలిస్తేనే అభివృద్ధి… టిడిపి నగర అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లో టి.జి భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే నగరం అన్ని రంగాల్లో డెవలప్ అవుతుందని టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. నగరంలోని 46 వ వార్డు నరసింహారెడ్డి నగర్లో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మేనిఫెస్టో వివరించి మహిళలు, యువతకు టిడిపి అధికారంలోకి వచ్చాక జరగబోయే లబ్ది గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అభివ్రుద్ది, సంక్షేమం ఉంటాయన్నారు. ప్రజలందరూ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. పెరిగిపోయిన ధరలు అదుపులో ఉండాలంటే టిడిపి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ లక్ష్మి, ప్రదీప్, డిష్ బాష, రాజ్ కుమార్, తిరుపతి, అదీబ్, చిట్టి శ్రీను, శ్రీనివాసులు, శాంతి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author