PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధి పథకాలే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయి : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు: పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్:41వ వార్డులోని 108వ సచివాలయం పరిధిలోని “గడప,గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమన్ని శుక్రవారం నాడు పాణ్యం శాసనసభ్యులు టీటీడీ పాలక మండలి సభ్యులు, నంద్యాలజిల్లాఅధ్యక్షులు_కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటూ, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల‌ను నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తోందని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ` కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోందన్నారు సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ధిపొందిన ప్ర‌తీ కుటుంబం జ‌గ‌న‌న్న పాల‌న‌కు జై కొడుతోందని వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీ చరిత్ర సృష్టించబోతుందని మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలియజేశారు..ఈ కార్యక్రమం లో స్థానిక 41 వార్డ్ కార్పొరేటర్, ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇంచార్జి శ్వేతారెడ్డి మరియు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, వైస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పోతుల సునీత మరియు అవుకు మండల జడ్పిటిసి చల్ల శ్రీ లక్ష్మి ఇతర కార్పొరేటర్లు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author