PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ 93.14లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి: రూ 93.14లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్స్ ను ప్రారంభించిన…..ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో రూ38.40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, రూ23.90లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, రూ 20.84లక్షలతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను అమకతాడు ఎంపీటీసీ,సర్పంచు బోయ సర్వేశ్వరి,ఎంపిపి డాక్టర్ వెంకట రామిరెడ్డి, జెడ్పీటీసీ కెఈ సుభాషిణి,కర్నూల్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి,గ్రామ నాయకులు  తో కలసి పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, డాక్టర్లు,సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author