PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోటి 32 లక్షల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే                    

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ మండలం  చక్రాళ్ళ గ్రామంలో  1 కోటి 32 లక్షల 54 వేల రూపాయలతో పూర్తి అయిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గురువారం ప్రారంభించారు.  రూ 43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రూ 23.94 లక్షలతో  నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా సెంటర్ ను  మరియు గడప-గడపకు మన ప్రభుత్వం నిధులు, NREGS నిధులు 65 లక్షలతో పూర్తి అయిన సీసీ రోడ్లు మరియు డ్రెయిన్లు లను గ్రామ సర్పంచ్ శ్రీరాములు, జెడ్పీటీసీ ఉరుకుందమ్మ, ఎంపిపి నారాయణ దాస్,వైస్ సర్పంచ్ రంగా నాయక్ మరియు అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలిసి  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ   ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ నాయక్, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు సోమ శేఖర్, పత్తికొండ మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు చక్రాల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు,మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు,సచివాలయం సిబ్బంది,మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author