NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండేళ్లలో… అభివృద్ధి శూన్యం..!

1 min read

– టీడీపీ కడప అసెంబ్లీ ఇన్​చార్జ్​ వీఎస్​ అమీర్​బాబు
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : రాష్ట్రంలో రెండేళ్లలో అభివృద్ధి లేదని, ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని టీడీపీ అసెంబ్లీ ఇన్​చార్జ్​ వీఎస్​ అమీర్​బాబు ఆరోపించారు. 13 రోజు రిమ్స్​ వద్ద కోవిడ్​ బాధిత కుటుంబ సభ్యులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అమీర్​బాబు కరోనా రక్కసి ప్రజల ప్రాణాలను కబళించేస్తుంటే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రావడం లేదని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసైనా కనువిప్పు తెచ్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, టీడీపీ నాయకులు ఛాన్ బాష, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author