PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు..

1 min read

– చిల్లా వేణుగోపాల్ రెడ్డి, కృష్ణవేణి దంపతులు రూ1,01,116/- లు అన్నదానవిరాళం..
– వివిధ సేవలకు రూ:1,08,496/-లు ఆదాయం..

పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డిగూడెం : శనివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారికి ప్రతి శనివారం నిర్వహించు పంచామృత అభిషేక కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరియు దర్శనార్ధము అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి తమలపాకులతో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. ఈ రోజు మద్యాహ్నం గం.1.00 ల.వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 1,08,496/- లు సమకూరినది.. సుమారు 800 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈరోజు స్వామివాకి హైదరబాద్ వాస్తవ్యులు చిల్లా వేణుగోపాలరెడ్డి, కృష్ణవేణి దంపతులు రూ.1,01,116/-లు ఆన్నదాన విరాళముగా సమర్పించినారు. వారికి ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ స్వామివారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేసినారు. ఈ రోజు ఆలయమువద్ద శ్రీస్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author