PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైకోర్టు తీర్పు పై ధ‌ర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ జరిగింది. ఇటీవల హైకోర్టు తీర్పు, ప్రభుత్వ విధానం, 3 రాజధానుల అంశంపై చర్చ జరుగుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. న్యాయ నిపుణులతో చర్చించామన్నారు. హైకోర్టు తీర్పు చాలా సున్నితమైందన్నారు. బాధ్యతలను కట్టడి చేసే విధంగా హైకోర్టు తీర్పు ఉంటోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులంటే అందరికీ గౌరవం ఉందని ధర్మాన పేర్కొన్నారు. గతంలో రాజరిక వ్యవస్థ ఉండేదని.. రాజు ఏం చెబితే అది నడిచేదని పేర్కొన్నారు. అధికారం రాజు దగ్గరే కేంద్రీకృతం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదని.. అక్కడి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిందని ఎమ్మెల్యే ధర్మాన పేర్కొన్నారు.

                                           

About Author