PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

27న ‘ఆంధ్రప్రదేశ్​ టీచర్స్​ గిల్డ్​’ వజ్రోత్సవాలు

1 min read

ఎల్​.కె. చిన్నప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పల్లెవెలుగువెబ్​: ఉద్యోగ భద్రత.. చెప్పుకోదగ్గ జీతం… లేని ఎయిడెడ్​ సిబ్బంది సంక్షేమం…అభ్యన్నతే ధ్యేయంగా 1947లో కీ.శే. కె.వి. అయ్యర్​, కీ.శే. ఎండి ఖాసిం, బాలచంద్ర డి.పాండే లాంటి మహనీయులు ఎయిడెడ్​ మరియు ప్రైవేట్​ స్రూల్స్​ టీచర్స్​ గిల్డ్​ను స్థాపించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మహానుభావులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్​ టీచర్స్​ గిల్డ్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్​.కె. చిన్నప్ప.  ఈనెల 27న విజయవాడలోని గవర్నర్​పేట,  మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో  ఏపీటీజీ 75వ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ, ప్రత్యేక గౌరవ అతిథులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పతారెడ్డి, ఏపీజీఈఎఫ్​ మరియు ఏపీ సెక్రటేరిట్​  అధ్యక్షులు కాకర్ల వెంకట రామిరెడ్డి, గౌరవ అతిథులుగా మాజీ ఎమ్మెల్సీలు మోహన్​ రెడ్డి,  పి.సుధాకర్​ రెడ్డి,,పి. సుబ్బారెడ్డి, పూల రవీంద్ర, గాదె శ్రీనివాసులు నాయుడు,  బచ్చల పుల్లయ్య, ఏఎస్​ రామకృష్ణ,  తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్​ రెడ్డి, ఏపీఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విచ్చేస్తున్నారని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీటీజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్​.కె. చిన్నప్ప వెల్లడించారు.

About Author