NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వర‌లో డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌్వ‌ర‌లో డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఉద్దేశించి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది జూలై నాటికి 75 జిల్లాల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఒక స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. డీబీయూలకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ గత నెలలో విడుదల చేసింది. ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ చౌదరి సారథ్యంలోని కమిటీ వీటిని రూపొందించింది. ఆర్‌బీఐ కమిటీ మార్గదర్శకాల ప్రకారం డీబీయూలను బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లుగా పరిగణిస్తారు. ఇవి కనీస డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలు అందించాల్సి ఉంటుంది.

                                   

About Author