PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీడియాను మూసుకు కూర్చోమన్న దిల్ రాజు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వాస్తవాలు తెలుసుకొని రాయండి. లేకపోతే మూసుకు కూర్చోండి’.. అని మీడియాను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీవ్రంగా స్పందించారు. ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్‌లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు.. ఈ సినిమా విడుదల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు మీడియాపై మండిపడ్డారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మీడియా వారు అడిగితే టైమిస్తాను. నిజానిజాలు తెలుసుకొని రాయండి. మీ వ్యూస్, క్లిక్కులు, సబ్‌స్ర్కైబర్ల కోసం నా పేరును పాడు చేయవద్దు. మీరు తొక్కితే తొక్కించుకునేంత చేతకాని వారెవరూ లేరిక్కడ. అసలు ఏమీ తెలుసుకోకుండానే మీడియా రాద్ధాంతం మొదలు పెట్టింది. సాధారణంగా నేను ఎవరితోనూ గొడవలు పెట్టుకోను. ‘కార్తికేయ 2’ వదంతి నన్ను చాలా అప్సెట్ చేసింది. మీడియా నన్ను బలిపశువును చేసింది.

                                          

About Author