PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దిశా వన్​స్టాప్​ సెంటర్​ సేవలు అభినందనీయం

1 min read

– ఏపీ మహిళా కమిషన్​ సభ్యురాలు విజయశ్రీ

పల్లెవెలుగు వెబ్​ :దిశా వన్​ స్టాప్​ సెంటర్​ ద్వారా బాధిత మహిళలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఏపీ మహిళా కమిషన్​ సభ్యురాలు విజయశ్రీ. గురువారం కర్నూలు దిశా వన్​స్టాప్​ సెంటర్​ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. వన్​స్టాప్​ సెంటర్​లో సక్సెస్​ స్టోరీ, సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు.  అనంతరం వన్​స్టాప్​ సెంటర్​లో ఉంటున్న బాధితులతో మాట్లాడారు.

అత్యాచారం గురైన మహిళలు, యువతులకు అండగా నిలవాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ఏపీ మహిళా కమిషన్​ సభ్యురాలు విజయశ్రీ వన్​స్టాప్​ సెంటర్​ సిబ్బందిని ఆదేశించారు.  కార్యక్రమంలో  సెంటర్​ అడ్మినిస్ర్టేటివ్​ పి. మేరీ స్వర్ణలత, ఎస్​ఐ  సోనమ్మ, సిబ్బంది ఉన్నారు.

About Author