PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మతం మారితే అన‌ర్హ‌త త‌ప్ప‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రిజ‌ర్వేష‌న్ పొందుతూ మతం మారితే అన‌ర్హ‌త త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఏపీలో హిందూ మ‌తాన్ని దెబ్బ‌తీసే కుట్ర జ‌రుగుతోంద‌ని అన్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని విమ‌ర్శించారు. దళితుల నిధులను కూడా పక్కదారి పట్టించారన్నారు. 4 కోట్ల దళిత విద్యార్థుల కోసం మోదీ కొత్త పథకం ప్రారంభించారన్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ కేంద్రమే బ్యాంక్‌ అకౌంట్‌లో వేస్తుందన్నారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు.

                                   

About Author