PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దోమ‌ల నివార‌ణ‌కు హైపో ద్రావ‌ణం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.. టి.జి భ‌ర‌త్

1 min read

ఎన్‌.ఆర్ పేట‌లోని వీధుల్లో స్వ‌యంగా పిచికారీ చేసిన టిడిపి నేత‌లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలో పెరిగిపోయిన దోమ‌ల‌ను అరికట్టేందుకు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా హైపో ద్రావ‌ణం పంపిణీ చేస్తున్నట్లు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. మౌర్య‌ ఇన్‌లో న‌గ‌ర ప్ర‌జ‌ల కోసం హైపో ద్రావ‌ణం అందుబాటులో ఉంచామ‌న్నారు. గ‌త రెండు రోజులుగా ప్ర‌జ‌లు ఈ ద్రావ‌ణాన్ని తీసుకెళుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉంటే న‌గ‌రంలోని 49వ వార్డుకు చెందిన టిడిపి నేత‌ కౌశిక్ ఆధ్వ‌ర్యంలో యూసుఫ్ మ‌సీదు, ఎం.సి నాగ‌ప్ప వీధి, రోడ్ నెం.8 రోడ్ నెం.9 ప్రాంతాల్లో మురుగు కాల్వ‌లు, అప‌రిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో హైపో ద్రావ‌ణం పిచికారీ చేశారు. ప్ర‌తి ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి ఇంటి ప‌రిస‌రాల్లో సైతం హైపో పిచికారీ చేశారు. త‌మ పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ స‌హాయంతో ఉచితంగా హైపో ద్రావ‌ణం తీసుకొని దోమ‌ల‌ను త‌రిమికొట్టేందుకు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. ఈ మంచి కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుండి విశేష‌ స్పంద‌న వ‌స్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్వ‌ర్ బాషా, రామ‌మూర్తి, మ‌హేష్‌, సునీల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author