PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరాశ్రుయులకు దుప్పట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు , వెబ్ ఆత్మకూరు : పేదల పెన్నిధి సేవా తత్పురుషుడు శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి తో శ్రీశైలం నియోజక వర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం అధ్వర్యంలో నిరాశ్రుయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గురువారం తెల్ల వారు జామున జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి నాగూర్ ఖాన్ ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్,ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా లు హాజరయ్యారు.పట్టణంలోని కొత్త బస్టాండ్ లో అభాగ్యులను గుర్తించి వారికి దుప్పట్లు అందజేశారు.అనంతరం నంద్యాల టర్నింగ్ వద్ద చలికి వణుకుతూ నిద్రిస్తున్న వారికి దుప్పట్లు కప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి చూపిస్తున్న ప్రేమాభిమానాలుచూపిస్తున్న ఆదరణ వెల కట్టలేనిదని అన్నారు.శీతాకాలంలో నిరాశ్రుయులు అనుభవిస్తున్న బాధలు వర్ణాతీతం వారిని మానవత్వంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు.15 మంది నిరాశ్రులైన వారికి దుప్పట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 19 వ వార్డ్ అద్యక్షులు సుబ్బా రాజు,పట్టణ మైనారిటీ అధ్యక్షుడు గౌస్ నాయకులు సునీల్ యాదవ్,మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

About Author