PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దత్త జ్ఞాన బోధ సభా ట్రస్టు ఆధ్వర్యంలో మజ్జిగ పులిహోర పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఎండలు ఎక్కువగా ఉన్నందు వలన సూర్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద చల్లని మజ్జిగ పులిహోర సుమారు 1500 మందికి పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా 29వ వార్డు కార్పొరేటర్ S.సుదర్శన్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమము శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం తరపున శ్రీ అనగా దత్త జ్ఞాన బోధ సభా ట్రస్టు వారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు T.శివరామకృష్ణ గారు డాక్టర్ C.ఆంజనేయులు గారు డాక్టర్ C.A.నగేష్ వర్మ గారు B.ప్రకాష్ గారు C.A. రమేష్ వర్మ గారు T.శ్రీదేవి గారు N.రమాదేవి గారు C.A.రాజేశ్వరి గారు P.జ్యోతి గారు S.శైలజ గారు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

About Author