PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్న్ షిప్  పూర్తి చేసుకున్న డిగ్రీ విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ..

1 min read

– విద్యార్థులు భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఎదగాలి.. హెచ్ఆర్ మేనేజర్ ఎన్.ఎ సురేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  కైకలూరు వై.వి.ఎన్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న  విద్యార్థులు, స్థానిక కొత్తూరు జూట్ మిల్లులో ఆరు నెలల సెమిస్టర్  ఇంటర్న్ షిప్ విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఈ విద్యార్థులకు కొత్తూరు జూట్ మిల్లు హెచ్.ఆర్. మేనేజర్  ఎన్.ఎ.సురేష్ సర్టిఫికెట్ లు అందజేశారు. ఈ విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు  డాక్టర్ బి.జగన్మోహనరావు పాల్గొని తమ కళాశాల తరుపున మిల్లు యాజమాన్యానికి క్రృతజ్ణతలు తెలియజేశారు.

About Author