PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కుల పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​ : నిరుపేదలు ఆరోగ్యంగా జీవించాలన్న  లక్ష్యంతో  సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి  సీఎం రిలీఫ్​ ఫండ్​ను విడుదల చేస్తున్నారని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ కోరారు. శనివారం నగరంలోని రాయల్​ ఫంక్షన్​ హాల్​లో బాధితులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.  ఈ సందర్భంగా  కర్నూల్ శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు 14 లక్షల 22వేల ఆర్థికంగా చెక్కు రూపంలో సహాయం అందజేశామన్నారు. బాధితుడికి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ ఏదైనా వైద్యం నిమిత్తం చికిత్స చేయించుకోవడం నాలుగు లక్షల రూపాయలు వైద్య ఖర్చులు ఆవ్వడం జరిగింది మరొక బాత్ లివర్ ట్రాన్స్ఫర్ రేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కు రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశారు. పేదల సంక్షేమార్థం వైఎస్సార్​ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్​ ఫండ్​ విడుదల చేసిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author