PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జెఎస్డబ్ల్యు ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామం వద్ద ఉన్న జెఎస్డబ్ల్యు సిమెంట్ ఫ్యాక్టరీ సౌజన్యంతో బెంగళూరుకు చెందిన విజన్ స్ప్రింగ్ సంస్థ మూడు రోజులు గడివేములలో కంటి సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు ప్రత్యేక క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా కంటిలోపం ఉన్నవారికి పరీక్షించి కంటి అద్దాలను పంపిణీ చేశారు దాదాపు మూడు రోజులకు గాను 300 మందికి కంటి పరీక్షలు చేసి అద్దాలను పంపిణీ చేసినట్టు జెఎస్డబ్ల్యు సి ఎస్ ఆర్ విజయలక్ష్మి తెలిపారు.

About Author