NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు ,కర్నూలు:  పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమములో భాగంగా 14-02-2025 వ తేదిన పాణ్యం నియోజవర్గము లోని కల్లూరు మండలం పెద్దపాడు ఎ.పి. మోడల్ స్కూల్ నందు పంపిణీ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమం లో పెద్దపాదు గ్రామంలో దృష్టిలోపము ఉన్న 46 మంది విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పాణ్యం నియోజక వర్గము శాసన సభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి ద్వారా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి డాక్టర్  పి. శాంతి కళ , జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి శ్రీమతి డాక్టర్ ఎం. సంద్యా రెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీమతి  రేణుక రెడ్డి  , పాఠశాల ప్రిన్సిపల్  ఈరన్న రావు  , పాఠశాల కమిటే అద్యక్షులు మధు నరసింహం  36వ వార్డ్ నాయకులు  తిరుమలేస్వర్ రెడ్డి   పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు .  కర్నూలు జిల్లాలో 1.26,412 మంది విద్యార్థులకు వంటి పరీక్షలు నిర్వహించగా, 3700 మంది విద్యార్థులకు దృష్టి లోపము ఉన్నట్లు గుర్తించి, ఉచిత కంటి అద్దాలు పంపిణి కార్యక్రమము చేపడుసున్నట్లు  జిల్లా అంధత్వ నివారణ అధికారి శ్రీమతి డా.ఎం. సంధ్యారెడ్డి  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *