PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజేఏసీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కరోన కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కేజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని 50మంది చేతివృత్తిదారులు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేజేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చాలా పేద కుటుంబాలు ఉపాధి కోల్పోయి అష్టకష్టాలు అనుభవిస్తున్నారని, వారి ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగముని నాయుడు, బత్తుల లక్ష్మికాంతయ్య, వివి. నాయుడు సీమ కృష్ణ, దేవపూజ ధనుంజయ ఆచారి, బెస్త శ్రీనివాసులు, హరికృష్ణ, సురేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author