PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కర్నూలు నగరంలోని ప్రకాశ్ నగర్లో షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వాహకులు టోపీలు పంపిణీ చేశారు. 48వ వార్డు మెయిన్ రోడ్డులో వాహనదారులు, హమామీలకు టోపీలు అందజేశారు. అనంతరం ట్రస్టు చైర్మన్, టిడిపి నేత మన్సూల్ ఆలీఖాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండ వేడిమి పెరిగిపోతూనే ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో టోపీలు పంపిణీ చేస్తున్నామన్నారు. పేదలకు ఏదో ఒక రూపంలో సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ట్రస్టు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. టోపీలు ఇవ్వడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమలత, భాస్కర్, సద్దాం, రఫి, తదితరులు పాల్గొన్నారు.

About Author