PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు నోటు పుస్తకాలు.. పెన్నులు పంపిణీ                 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్థానిక ఎంపీపీ పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, విద్యార్థులకు నోటు పుస్తకములు పెన్నులు అందజేశామన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ని విద్యార్థుల పైనే ఆధారపడి ఉందన్నారు. ఎందరో మహాత్ములు బడి ఆవరణలోనే విద్యార్థి దశ నుండే ఉద్భవించారన్నారు. భవితకు బాట విద్యార్థి దశనుండే ప్రారంభమవుతుందని అన్నారు. డిఎస్పి  శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్, డాక్యుమెంట్ రైటర్ నాగేంద్ర, స్కూల్ హెడ్మాస్టర్ బేబీ నిర్మల, స్కూల్ టీచర్లు మాధవిలత , వీణ, ప్రశాంతి, పద్మలత, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author