PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

1 min read

పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ                     

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ప్రతి నెల 9వ తేదీ పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో స్కానింగ్ కొరకు వచ్చే గర్భిణీ స్త్రీలకు పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి సౌజన్యంతో శుక్రవారం  పౌష్టికాహారం పంపిణీ చేశారు.పత్తికొండ మరియు పరిసర గ్రామాల గర్భిణీ స్త్రీలు ప్రతినెల తొమ్మిదో తేదీన స్కానింగ్ కొరకు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం శ్రీ పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో  పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యురాలు కల్పన  భోజనం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలు మరియు వారికి సహాయకులుగా వచ్చిన వారికి కూడా పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దేవరగట్టు లక్ష్మి, సరోజ . .  వార్డ్ మెంబర్లు బోడ సావిత్రి, లైట్ నాగరాజు, పత్తికొండ పోచిమి రెడ్డి సేవాదళ్ సభ్యులు మరియు దూదేకొండ పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు పెదరాయుడు, గోపాల్ పాల్గొన్నారు.

About Author