PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది పరీక్ష రాస్తున్న విద్యార్థులకు పెన్నులు పంపిణీ

1 min read

– పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పదవ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వైఎస్ఆర్సిపి నాయకులు, పెదపాడు సహకార సంఘ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్ అన్నారు. సోమవారం పెదపాడు హై స్కూల్ లో గల పరీక్ష కేంద్రం వద్ద పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు రాత పెన్నులను అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశానుసారం పరీక్ష రాస్తున్నటువంటి వారికి పెన్నులు ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు రెడ్డి స్వర్ణకుమారి, వైసీపీ నాయకులు కొత్తూరి విమల రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రెడ్డి వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author