PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మార్కాపురం సచివాలయం లో పింఛన్లు పంపిణీ..

1 min read

త్రాగునీరు, వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ పలు వసతులు ఏర్పాటు

సందర్శించి పెన్షన్ పంపిణీ పరిశీలించిన డిపిఓ శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లా కలెక్టర్ వారీ  ఆదేశాల మేరకు బుదవారం ఏలూరు రూరల్ మండలం మల్కాపురం సచివాలయాన్ని  జిల్లా పంచాయతీ అధికారి టి.శ్రీనివాస్ విశ్వనాథ్ సందర్శించి పెన్షన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు. తాగునీటి సౌకర్యం, నీడగా టెంట్ ఏర్పాటు , కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు, వో అర్ ఎస్ప్యాకెట్లతో మినీ వైద్య శిబిరం ఏర్పాటు ను పరిశీలించారు.పింఛనుదారులకు సహకరించేందుకు అనుసంధాన వ్యక్తిని నియమించినట్లు అయన తెలిపారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 25 మందిలో మొత్తం 362 మంది పెన్షనర్లు గాను వారిలో 25 మంది  మంచాన పడినట్లు గుర్తించామన్నారు. వారికి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీకి ప్రత్యేక వ్యక్తిని ఏర్పాటుచేశామన్నారు.పెన్షన్ పంపిణీకి 06 గురు సిబ్బందికి ఫంక్షన్‌లకు లాగిన్‌లు ఇవ్వబడ్డాయాన్నారు.  పెన్షన్ పంపిణీకి సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారన్నారు. ఆయనతో విస్తరణ అధికారి ఎం సరళ కుమారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author