NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గర్భిణీ స్త్రీలకు పోచిమిరెడ్డి సేవాదళ్ పౌష్టికాహారం పంపిణీ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా, ప్రతి నెల 9వ తేదీ పత్తికొండ మరియు వివిధ గ్రామాల నుండి స్కానింగ్ కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మరియు వారు సహాయకులకు పౌష్టికాహార వసతిని శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి  కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కల్పన గర్భిణీ స్త్రీలు, వారి సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించి ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీటీసీలు దేవరగట్టు లక్ష్మి, అనిత, సరోజ, వార్డు మెంబర్లు బోడ సావిత్రి , మాజీ ఉప సర్పంచ్ కే కోటేశ్వరరావు, బోడ శ్రీను మరియు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author