PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గుడ్ నైబర్స్ ఇండియా’ ఆధ్వర్యంలో శానిటైజర్స్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండల పరిధిలోని మట్లి,తాటిగుంటపల్లి,ఒదివీడు, తదితర గ్రామాల సచివాలయంలలో పనిచేసే సిబ్బందికి మరియు అధికారులకు గుడ్ నైబర్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో శానిటైజర్స్ పంపిణీ చేసినట్లు సంస్థ మేనేజర్ నాగేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మూడోదశ ప్రారంభమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు వేసుకుని సామాజిక దూరం పాటించాలన్నారు. విందులు వినోదాలకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.కరోనా బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా తమ సంస్థ ఆధ్వర్యంలో 50 వేల మాస్కులు,50వేల శాని టైజర్స్ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది మరియు సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author