NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో ఎబినేజర్‌ మినిస్ట్రీస్ పాస్టర్ యాకోబు సహకారంతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల తహసిల్దార్ సిరాజుద్దీన్,వైస్ ఎంపీపీ నబి రసూల్,గ్రామ సర్పంచ్ ఉషారాణి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసిరెడ్డి కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ముస్లిం మహిళలకు గత 10 సంవత్సరాల నుండి పేద ముస్లీం మహిళలకు కుట్టు మిషన్‌లను పంపిణి చేస్తూ సంస్థ ద్వారా పలు సేవాకార్యక్రామాలు చేస్తున్నారు.ఎబినేజరే మినిస్ట్రీస్ వారు ముందుకు వచ్చి పేదవారి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని వారు కొనియాడారు.తర్వాత పాస్టర్ యాకోబును వారు సత్కరించారు.ఈకార్యక్రమంలో చిన్న పుల్లారెడ్డి,రాంభూపాల్‌ రెడ్డి,కరీం తదితరులు పాల్గొన్నారు.

About Author