NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులకు కందిపప్పు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మండలంలోని బొల్లవరం గ్రామ ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులకు కందిపప్పు పంపిణీ చేశారు. పాఠశాలలో 230 మంది విద్యార్థులు ఉండగా 214 మందికి మాత్రమే అందజేశారు. కాగా గత ఏడాది సెప్టెంబర్ నుండి జనవరి వరకు విద్యార్థులకు అందజేయాల్సిన కందిపప్పును సోమవారం విడుదల కావడంతో అందజేశారు. ఇదే మాసాలకు సంబంధించి గతంలో కోడిగుడ్లు బియ్యం పంపిణీ చేశారు. ఆ సమయంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు నేడు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు, రిటైర్డు హెచ్​ఎం నాగభూషణం రెడ్డి పాల్గొన్నారు.

About Author