PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు స్ప్రింకర్ పైపులు పంపిణీ : సర్పంచ్

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని మాసపేట గ్రామంలో 19 మంది రైతులకు సబ్సిడీ కింద స్ప్రింకర్లు పైపులను గ్రామ సర్పంచ్ షేక్ షంషున్ భి పంపిణీ చేశారు.ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ పైపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ మరియు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి రైతులకు తెలియజేశారు.మండల వ్యవసాయ అధికారి పీరునాయక్ మాట్లాడుతూ ఈక్రాప్ బుకింగ్ లో రైతులు ఎవరైతే తమ పంటలను నమోదు చేసుకున్నారో వారి జాబితాను సోమవారం రోజున రైతు భరోసా కేంద్రాలలో అతికించడం జరుగుతుందని వాటిలో తప్పొప్పులు ఏమైనా ఉంటే సరి చేయించుకోవాలని ఆయన తెలియజేశారు.ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అస్రఫ్ భాష,వైసిపి నాయకులు అన్వర్ భాష,కలమందలపాడు మహబూబ్ బాషా,గ్రామ వ్యవసాయ సహాయకులు హుస్సేన్ భాష మరియు రైతులు పాల్గొన్నారు.

About Author