PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సబ్సిడీ సెనగ విత్తనాలను పంపిణీ        

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి : మండలం లో,వ్యవసాయ అధికారి* ఏవో అక్బర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు గ్రామాల రైతులకు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సబ్సిడీ సెనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ రోజు సాయంత్రం వెల్దుర్తి లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఏం కావాలో తెలుసుకొని వారికి అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నాడు, ఆర్థికంగాను సహాయం చేస్తున్నాడు అన్నారు వ్యవసాయం పండుగ చేసేలా పాలన సాగుతుందన్నారు ఆర్ బి కే ల ద్వారా ప్రతి రైతుకి వారి వారి సమీపంలోనే అన్ని రకాల పథకాలు అందిస్తోంది అన్నారు రైతుకు సహకారం అందిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలని కోరారు.ఈ  కార్యక్రమంలో మండల మండల కన్వీనర్ రవి రెడ్డి,వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సర్పరాజపురం వెంకటేశ్వర రెడ్డి,వెల్దుర్తి సర్పంచ్ ముత్యాల శైలజ, వ్యవసాయ అధికారులు వైఎస్ఆర్ పార్టీ మండల గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author