PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ

1 min read

– సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ గోనెగండ్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గోనెగండ్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగనన్న మాట్లాడుతూ రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్ కి నాణ్యమైన విత్తనాలు, ఎరువులును పంపిణీ చేసేందుకు రైతు భరోసా కేంద్రాలలో ముందస్తుగా నిల్వచేసి నేరుగా రైతుల ఇంటి వద్దకే విత్తనాలను, ఎరువులను సరఫరా చేస్తున్నామ‌ని తెలిపారు. రైతులు తమ పేరును గ్రామ వ్యవసాయ సహాయకులు వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఓ రాజా కిషోర్,మండల యూత్ ప్రెసిడెంట్ బందె నవాజ్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మన్సూర్,నాయకులు తిరుమల రెడ్డి, మహేష్ రెడ్డి, బాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, మానిక్ రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author